విజయవాడ కనకదుర్గమ్మ రథంపై ఉన్న మూడు సింహాలు చోరీ కావడంతో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై టీడీపీ నేత దేవినేని ఉమ ఘాటుగా స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన మంత్రి, అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
మూడు సింహాల చోరీకి సంబంధించిన ఆధారాలను అధికారులు ఎందుకు మాయం చేశారని ప్రశ్నించారు. మార్చి 15న రథానికి మెరుగు పెట్టినప్పుడు నాలుగు సింహాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు సింహాలు మాయమైన తర్వాత ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు. దేవాలయంలోని సీసీటీవీ ఫుటేజీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎవరిని రక్షించడం కోసం ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.