శర్వానంద్ హీరోగా RX 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ‘మహాసముద్రం’ను నిర్మిస్తోంది. సుంకర రామబ్రహ్మం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే హీరోయిన్గా సమంతను ఓకే చేయగా తాజాగా ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో ఐశ్వర్య రాజేష్ను తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఉన్నపళంగా సమంత ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకుందన్న చర్చ సినీవర్గాల్లో మొదలైంది. అసలు కారణం బయటకు తెలియకపోయినా.. సిద్దూ వల్లే సామ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు గాసిప్స్ వస్తున్నాయి. గతంలో సిద్ధార్థ, సమంత ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. చాలాచోట్ల వారిద్దరు జంటగా కనిపించడం, శ్రీకాళహస్తి ఆలయంలో కలిసి రాహుకేతు పూజ చేయడంతో పెళ్లి చేసుకుంటారన్న ప్రచారం జరిగింది. వీళ్లిద్దరు కలిసి ‘జబర్దస్త్’ అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు కానీ వీరిద్దరు బద్ధ శత్రువుల్లా మారిపోయారు. ఆ తర్వాత సమంత అక్కినేని వారసుడు నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుని సెటిలైన విషయం తెలిసిందే.
previous post
గ్లామర్ పేరిట పొట్టి బట్టలు వేసుకోలేను : అనుపమ పరమేశ్వరన్