రివర్స్టెండరింగ్ పేరుతో పోటీ లేకుండా సీఎం జగన్ మేనమామ బినామీకి టెండర్ ఇచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. రాష్ట్రంలో నడుస్తున్న రెండు ప్రాజెక్ట్లు జగన్ బంధువులవేనని తెలిపారు. షెల్ కంపెనీలకు ఆధ్యుడు ఎంపీ విజయసాయిరెడ్డేనని విమర్శించారు. ఎక్కడో ఐటీ దాడులు జరిగితే టీడీపీకి ఆపాదిస్తున్నారని వైసీపీ నేతలపై దేవినేని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ సన్నిహితుల కంపెనీ ప్రతిమా ఇన్ఫ్రాలో ఐటీ సోదాలు చేశారని, మంత్రులు ఎందుకు ప్రతిమ పేరు ఎత్తడం లేదని ప్రశ్నించారు. ప్రతిమ పేరు ఎత్తితే కేసీఆర్ మీ తోకలు కత్తిరిస్తారని భయమా అని ప్రశ్నించారు. ఏ ముఖ్యమంత్రి కొడుకైనా 16 నెలలు జైల్లో ఉన్నారా అని నిలదీశారు. ఈడీ, సీబీఐ కేసుల్లో ముద్దాయిగా ఉన్నారా అని ప్రశ్నించారు.