ఈరోజు ఉదయం 11.30 గంటలకు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశాన్ని నిర్వహించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, రైతులకు దక్కని గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరల పెరుగుదల, ఉపాధి లేక కూలీల ఇక్కట్లు, ప్రజా సమస్యలపై ఈ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నట్టు సమాచారం.