పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలపై రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కు కాంగ్రెస్ అనర్హత నోటీసులు జారీ చేసింది. పైలట్తో పాటు ఆయనతో ఉన్న ఇతర ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేశారు. అసెంబ్లీ స్పీకర్ మొత్తం 19 మంది రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరు కానందున్న వల్ల అనర్హత వేటు వేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మరో వైపు బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను సచిన్ పైలట్ ఖండించారు. భారతీయ జనతా పార్టీలో చేరడం లేదని పైలట్ స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై పోరాడి గెలిచామని అన్నారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు తప్పుడు ప్రచారం చేశారని ఆయన అన్నారు.
ఐఏఎస్ లు ముఖ్య పాత్ర నిర్వహించాలి: నితిన్ గడ్కరీ