telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మాణిక్యాలరావు మరణం దిగ్భ్రాంతి కలిగించింది: చంద్రబాబు

chandrababu tdp ap

బీజేపీ నేత, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనా భారీనపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు స్పందిస్తున్నారు. ఆయన మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. మాణిక్యాలరావు మరణం దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో దేవాదాయశాఖ మంత్రిగా నిజాయతీతో కూడిన సేవలు అందించారని కీర్తించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చంద్రబాబు ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందిస్త, ఫొటోగ్రాఫర్ గా కెరీర్ ఆరంభించి, మంత్రిగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన మాణిక్యాలరావు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపించేవారని అన్నారు. ఆయన మరణ వార్త ఎంతో బాధ కలిగించిందని పేర్కొన్నారు.

Related posts