telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మాచర్ల దాడి ఘటనపై ఈసీకి చంద్రబాబు లేఖ

chandrababu

గుంటూర్ జిల్లా మాచర్ల దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డీజీపీ, రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై హత్యాయత్నం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. శాంతిభద్రతలు సరిగా లేనందువల్లే ఈ ఘటన జరిగిందని, పోలీసుల్లో ఒక వర్గం ఆరోపించారు.

దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, వైసీపీ దాడుల నియంత్రణకు ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలకు తగిన భద్రత కల్పించాలని లేఖలో కోరారు.

Related posts