గుంటూర్ జిల్లా మాచర్ల దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డీజీపీ, రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై హత్యాయత్నం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. శాంతిభద్రతలు సరిగా లేనందువల్లే ఈ ఘటన జరిగిందని, పోలీసుల్లో ఒక వర్గం ఆరోపించారు.
దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, వైసీపీ దాడుల నియంత్రణకు ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలకు తగిన భద్రత కల్పించాలని లేఖలో కోరారు.