టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. మంగళవారం విజయవాడలో టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం సందర్భంగా నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలల్లో మనపై దాడులు పెట్రేగిపోయాయని అన్నారు.
వైసీపీ తప్పుడు విధానాలతో వివిధ వర్గాలవారు.. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. భౌతిక దాడులతో పాటు ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారు. సకాలంలో పెన్షన్లు ఇవ్వడం లేదు. ప్రజలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పెద్ద ఎత్తున టీడీపీ ఓట్లు తొలగించాలని తహసీల్దార్లకు చెప్పారని మండిపడ్డారు. ఓట్ల తొలగింపుపై న్యాయపోరాటం చేద్దామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.