టీడీపీ నేత, ఏపీ కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కరోనాతో కన్నుమూశారు. రామానుజయకు కొన్ని రోజుల కిందట కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా లక్షణాలు ఉండడంతో చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. కొన్నిరోజులుగా ఆయనకు వైద్యులు వెంటిలేటర్ అమర్చి చికిత్స అందిస్తున్నారు. ఇవాళ పరిస్థితి విషమించడంతో రామానుజయ ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు.
పార్టీ నేత మృతితో అధినేత చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చలమలశెట్టి రామానుజయ మృతితో టీడీపీ ఓ సమర్థుడైన నేతను కోల్పోయిందని తెలిపారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్ల నుంచి మహిళల స్వయం ఉపాధి పథకాల రూపకల్పన వరకు రామానుజయ ప్రధానభూమిక పోషించారని కొనియాడారు.