బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సుశాంత్ చివరి సారిగా నటించిన ‘దిల్ బేచారా’ సినిమా త్వరలో అభిమానుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాను ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడిన ఈ చిత్రం, వచ్చే నెల 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలకు సిద్ధమైంది. హాలీవుడ్ లో వచ్చిన ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’కు ఈ సినిమా రీమేక్ గా తీశారు. సంజనా సాంఘీ ఈ సినిమాలో సుశాంత్ హీరోయిన్ గా నటించింది. క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ చాబ్రా తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఉచితంగా చూడవచ్చని, ఇది ప్రతి ఒక్కరి స్థాయిలో చిరస్థాయిగా నిలుస్తుందని, ప్రేమ, ఆశ, అంతులేని జ్ఞాపకాల సమాహారమే ఈ చిత్రమని డిస్నీ ప్లస్, హాట్ స్టార్ వెల్లడించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ ముఖేశ్ మాట్లాడుతూ, సుశాంత్ తనకు తొలి చిత్రం నుంచే తెలుసునని, తామిద్దరమూ కలిసి సినిమా చేయాలని ఎన్నో కలలు కన్నామన్నారు. అన్నింటినీ మిగిల్చి అతను వెళ్లిపోగా, ఇప్పుడు తాను ఒంటరిగా సినిమాను విడుదల చేస్తున్నానని భావోద్వేగానికి గురయ్యారు. సుశాంత్ ఆఖరి చిత్రాన్ని థియేటర్ లో విడుదల చేసి తమకు చూపించాలని ఫ్యాన్స్ కోరినా, ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలు ఓటీటీ మాధ్యమంగానే విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నారు.
Celebrating the late #SushantSinghRajput‘s legacy that will be etched in the minds of all and cherished forever. #DilBechara coming to everyone on @DisneyPlusHS on July 24. @foxstarhindi @sonymusicindia @DisneyplusHSVIP @MukeshChhabraCC pic.twitter.com/AhC5PKBVau
— A.R.Rahman (@arrahman) June 25, 2020