telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తమ్ముడి మరణం ఫై ప్రముఖ విలన్ షాకింగ్ కామెంట్స్…!

anandraj

విలన్‌గా పేరొందిన తమిళ నటుడు ఆనందరాజ్ తమ్ముడు కనగసభాయ్(49) రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. పుదుచ్చేరిలో నివాసముంటోన్న కనగసభాయ్ అరటి పండుకు పురుగుల మందు పూసుకుని తిని ఆత్మహత్య చేసుకున్నారు. కనగసభాయ్ చిట్ ఫండ్ కంపెనీని నడుపుతున్నారని దానిలో భారీ నష్టం రావడంతో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పుదుచ్చేరి, తమిళనాడుకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కనగసభాయ్ చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ చిట్ ఫండ్ కంపెనీకి రూ. 50 కోట్ల వరకు నష్టం వచ్చిందట. దీంతో తమ డబ్బు తిరిగిచ్చేయాలని వారందరి నుంచి కనగసభాయ్‌పై ఒత్తిడి పెరిగిందని.. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే, తన తమ్ముడి మరణంపై ఆనందరాజ్ స్పందించారు. అసలు తన తమ్ముడు ఆత్మహత్య చేసుకోవడానికి కంపెనీ నష్టాలు కారణం కాదన్నారు. ‘‘నా తమ్ముడికి వ్యాపారంలో ఎలాంటి నష్టం రాలేదు. కానీ, ఒకరి నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నాడు. ఇటీవలే కనగసభాయ్ ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ ఇంటి విషయంలో కొంతమంది నా తమ్ముడిని బాగా ఇబ్బంది పెట్టారు. తీవ్ర ఒత్తిడికి గురిచేశారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే నా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై లోతైన విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నానని’’ అని ఆనందరాజ్ చెప్పారు.

Related posts