వికారాబాద్ కాల్పుల ఘటనలో పురోగతి లభించింది. ఆవుపై కాల్పులు జరిపిన నలుగురిని అరెస్ట్ పోలీసులు చేశారు. ఇమ్రాస్, మహామీర్ అజీర్, షేక్ మహబూబ్, రాంచందర్, రఫీ అనే నలుగురిని సీసీ కెమెరా ఆధారంగా కేసును పోలీసులు ఛేదించారు. ఇమ్రాస్, హజార్ కాల్పులకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. అడవులకు వెళ్లి వేటాడటం వీళ్ల సరదాగా గుర్తించిన పోలీసులు..వేటకు ముందు ఇమ్రాస్ రెక్కీ నిర్వహించాడని పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ ఘటనలో హజార్ నుంచి రైఫిల్, 9 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అటు ఇమ్రాస్ పై ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు పోలీసులు. కాగా ఆవుపై కాల్పులు జరిపిన ఘటనపై ఇప్పటికే హిందూ మతానికి చెందిన కొందరు ధర్నాలు చేపడుతున్నారు. సానియా మీర్జా ఫార్మ్ హౌస్ దగ్గర ఈ ఘటన జరిగింది. దీంతో ఇంకా అనేక అనుమానాలు వచ్చాయి. చివరికి పోలీసులు ఇమ్రాస్, మహామీర్ అజీర్, షేక్ మహబూబ్, రాంచందర్, రఫీ నలుగురిని అరెస్ట్ చేశారు.
previous post