telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ది హత్యే… ప్రత్యక్ష సాక్షి సంచలన వ్యాఖ్యలు

Sushanth

సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది‌. ప్రత్యక్ష సాక్షిగా అనుకుంటున్న ఓ వ్యక్తి పోస్ట్‌మార్టం సమయంలో ఏం జరిగిందనే విషయాన్ని పూస గుచ్చినట్లు చెప్పాడు. పోస్టుమార్టం సమయంలో సుశాంత్ భౌతిక కాయం పట్టుకున్న ఓ వ్యక్తి జాతీయ మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం సుశాంత్ భౌతికకాయాన్ని కూపర్ హాస్పిటల్‌కు పంపారు పోలీసులు. అప్పడు సుశాంత్ సింగ్ భౌతికకాయాన్ని ఇద్దరు వ్యక్తులు మోసుకెళ్లారు. వారిలో ఓ వ్యక్తి.. డాక్టర్లు మాట్లాడుకోవడం గమనించినట్లు చెప్పాడు. పోస్టుమార్టం సమయంలో ఆ గదికి వెళ్లగా అది హత్యే అని డాక్టర్లు చెబుతుండటం తాను విన్నట్లు చెప్పాడు. సుశాంత్ సింగ్ భౌతిక కాయం పట్టుకునేప్పుడు ఆయన గొంతు చుట్టూ సెల్లో టేప్‌ ఆనవాళ్లను గమనించినట్లు తెలిపాడు. అంతేకాదు.. అతని శరీరంపై సూదులతో గుచ్చిన గుర్తులు కూడా కనిపించాయని చెప్పాడు. పోస్టుమార్టం జరిగే సమయంలో తాను అక్కడే ఉన్నట్లు చెప్పిన ఆ వ్యక్తి … సుశాంత్ సింగ్ కాలు ఒకటి ఫ్రాక్చర్ అయి ఉండటాన్ని గమనించినట్లు తెలిపాడు. సుశాంత్ సింగ్‌ను చూసేందుకు వచ్చిన రియా చక్రవర్తి.. మృతదేహాన్ని చూస్తూ “ఐయాం సారీ” అని చెప్పినట్లు ఆ వ్యక్తి మీడియాకు తెలిపాడు. ఇక కూపర్ హాస్పిటల్ వైద్యులు సెలవుపై వెళ్లిపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఇప్పటికే బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Related posts