telugu navyamedia
రాజకీయ

రాజీవ్‌ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

*మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హ‌త్య‌కు కుట్ర‌దారుడు విడుద‌ల‌కు సుప్రీం ఆదేశం..

*జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషుల్లో ఒకరి విడుదలకు సుప్రీం ఆదేశం

*రాజీవ్ గాంధీ హత్య కేసులో 31 ఏళ్ల తర్వాత పెరరివలన్ రిలీజ్
*2014లో జీవిత‌ఖైదీ శిక్ష విధించిన సుప్రీంకోర్టు..
*19ఏళ్ళ వ‌య‌సులో అరెస్ట్ అయిన పెరరివలన్..

*2018 సెప్టెంబర్‌లో తమిళనాడు ప్రభుత్వం సిఫార్సుపై పేరరివాలన్ పిటిషన్‌

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న దోషుల్లో ఒకరైన ఏజీ పెరరివలన్‌ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

1991 మే 21 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో రాజీవ్‌గాంధీని హత్య చేశారు.

ఈ కేసులో పెరరివాలన్ 31 ఏళ్లుగా ఏజీ పెరరివలన్ జైలులోనే ఉన్నారు. 1991, జూన్ 11న పెరరివాలన్ ను అరెస్ట్ చేసిన‌ప్ప‌డు అయ‌న‌కి 19 ఏళ్ళు.

రాజీవ్ గాంధీ హత్యకు వాడిన పేలుడు పదార్థాలు అందించినందుకు ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2014లో ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ సుప్రం కోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ కేసులో తన జీవిత ఖైదును సస్పెండ్ చేయాలని కోరుతూ  పెరారివలన్‌ వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

 

Related posts