telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం..రాజధానిపై అభిప్రాయ సేకరణ

AP

రాజధాని అంశంపై ఈ మధ్యకాలంలో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజధానికి సంబంధించిన అంశంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజధానిపై అభిప్రాయ సేకరణకు సిద్ధమయ్యింది. కొద్ది రోజుల క్రితమే ఈ కమిటీ సమావేశంకాగా.. తాజాగా ప్రజాభిఫ్రాయ సేకరణ ప్రారంభించింది.

అమరావతి సహా రాష్ట్రంలోని పట్టణాల పురోగతిపై ఆరువారాల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. కమిటీ కన్వినర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎస్ రావును నియమించారు. సభ్యులుగా ప్రొఫెసర్ మహవీర్, డాక్టర్ అంజలీమోహన్, డాక్టర్ శివానందరెడ్డి, ప్రొఫెసర్ కేటీ రవిచంద్రన్, ప్రొఫెసర్ అరుణాచలంలు ఉన్నారు. రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు రాష్ట్ర సమగ్ర పురోగతి కోసం ఈ నిపుణుల కమిటీ పని చేయనుంది.

రాజధాని నిర్మాణం సహా రాష్ట్రంలోని ప్రాజెక్టులపై అభిప్రాయాలు, సూచనలు పంపాలని కోరిన నిపుణుల కమిటీ కోరింది. రాజధానిపై అభిప్రాయాలు తెలియజేయాలనుకున్నవాళ్లు.. ఈ-మెయిల్, లేఖల ద్వారా పంపాలని జీఎన్ రావు కమిటీ కోరింది. అభిప్రాయాలను చెప్పదలచుకున్నవారు.. [email protected] అడ్రస్‌కు మెయిల్ చేయొచ్చు. విజయవాడలోని నిపుణుల కమిటీ కార్యాలయానికి లేఖల్ని పోస్టులో పంపాలి. సూచనలు పంపించేందుకు నవంబర్ 12వ తేదీ వరకు గడువు నిర్ణయించారు.  

Related posts