నేడు హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం 7 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి ట్యాంక్బండ్ వద్ద ఉన్న హోటల్ మారియట్కు రసూల్పురా రోడ్డు, ప్యారడైజ్, రాణిగంజ్, సైలింగ్ క్లబ్ మీదుగా చేరుకుంటారు. అక్కడ కార్యక్రమం పూర్తయిన తరువాత అదే దారిలో బేగంపేట్, పంజాగుట్ట ప్లెఓవర్, జుబ్లీహిల్స్ చెక్పోస్టు మీదుగా తన నివాసానికి చేరుకుంటారు. ఆయన పర్యటించే సమయంలో ట్రాఫిక్ను ఆయా రూట్లలో నిలిపివేయడం, మళ్లించడం చేస్తామని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్కుమార్ వెల్లడించారు.