telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

70 శాతం సెస్ ఉపసంహరణ..తగ్గనున్న మద్యం ధరలు!

liquor shops ap

ఢిల్లీలోని మద్యం ప్రియులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. మద్యంపై విధించిన 70శాతం కరోనా సెస్‌ను ఢిల్లీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఫలితంగా ధరలు అమాంతం తగ్గనున్నాయి. అయితే, ఇప్పటి వరకు మద్యంపై వసూలు చేస్తున్న 20 శాతం వ్యాట్‌కు అదనంగా మరో 5 శాతం పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మూడో విడత లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వం మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది.

అయితే, విపరీతమైన రద్దీ కారణంగా సామాజిక దూరం గాలికి ఎగిరిపోయింది. దీంతో రద్దీని తగ్గించి సామాజిక దూరం అమలయ్యేలా చూసేందుకు మద్యంపై 70 శాతం కరోనా సెస్ విధించింది. తాజాగా, ఇప్పుడీ సెస్‌ను ఉపసంహరించుకున్న ప్రభుత్వం వ్యాట్‌ను మరో ఐదుశాతం పెంచి 25 శాతం చేసింది. సెస్ ఉపసంహరణతో మద్యం ధరలు భారీగా తగ్గనున్నాయి.

Related posts