తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద రియాలిటీ షో సందడి మొదలైంది. నాలుగు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ గేమ్ షో ఇప్పుడు సీజన్ 5తో సందడి చేయడానికి మన ముందుకు వచ్చేసింది. నయా సీజన్ , నయా కంటెస్టెంట్స్, నయా టాస్క్స్ తో, బిగ్ బాస్ హోస్ట్ గా కింగ్ నాగార్జున వ్యవహారిస్తున్నారు. 100 రోజులు,15 వారాలు, నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు రెడీ అయ్యింది.
షో గ్రాండ్ ప్రీమియర్కు ముందుగానే ఈ షోలో పాల్గొనే టాప్ కంటెస్టెంట్ల పేర్లు బయటికి వచ్చాయి. బయటికి రావడమే కాదు.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల నుంచి తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ 5 మీదే అందరి చూపు… వీళ్లు వెళుతున్నారు… కాదు వాళ్లు వెళుతున్నారంటూ ఎన్నో న్యూసులు. అయితే వీటన్నింటికి చెక్ పెట్టేసింది బిగ్ బిస్ టీం…. కంటెస్టెంట్స్ లిస్టును రివీల్ చేయకుండానే గ్రాండ్ ప్రీమియర్ డేట్ సెప్టెంబర్ 5 అంటూ అనౌన్స్ చేసింది. బిగ్ బాస్ గ్రాండ్ ప్రీమియర్ డేట్ను అనౌన్స్చేయడంతో.. ఇప్పుడు అందరి ఆసక్తి కంటెస్టెంట్ల పై పడింది. ఇప్పటి వరకు తాజ్ డెక్కన్, మారియట్ హోటల్లలో క్యారెంటైన్లో ఉన్న కంటెస్టెంట్లను.. తాజాగా బిగ్ బాస్ సెట్లోకి తరలించారు బిగ్ బాస్ నిర్వాహకులు.
అయితే హౌస్కు తరలించిన వారిలో..యాంకర్ రవి-యూట్యూబర్ సరయు-కొరియోగ్రాఫర్ యాని మాస్టర్-యాక్టర్ మానస్-ఆర్జె కాజల్-యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్-సీనియర్ నటి ప్రియా-కొరియోగ్రాఫర్ నటరాజ్-మోడల్ శ్వేతా వర్మ-నటి లహరి తదితరులు ఉన్నారు.
“లక్ష్మీస్ ఎన్టీఆర్”పై కళ్యాణ్ రామ్ కామెంట్