రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో నటించబోతున్నాడు. క్రితం ఏడాది తమిళంలో భారీ హిట్ కొట్టిన “రాచ్చసన్” సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. తమిళంలో విష్ణు విశాల్, అమలా పాల్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా అక్కడ అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు తెలుగులో తెరకెక్కబోయే ఈ చిత్రానికి కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ప్రీ లుక్ వేలాడదీసిన ఒక బొమ్మతో, రూమ్ మొత్తం అంటించిన పేపర్స్ తో ఆసక్తికరంగా ఉంది. ఇదంతా చూస్తుంటే సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగేలా అన్పిస్తోంది.
Here is the Pre-Look of @BSaiSreenivas & @anupamahere #Rakshasudu
First look will be out tomorrow at 11am. Directed by Ramesh Varma Penmetsa. Produced by Satyanarayana Koneru. A Havish Lakshman Koneru Production.@AbhishekPicture pic.twitter.com/sshGPkmT4H
— BARaju (@baraju_SuperHit) April 5, 2019
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి “రాక్షసుడు” అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తమిళ స్టార్ హీరో సూర్య అనువాదం చిత్రం కూడా “రాక్షసుడు” అనే టైటిల్ తో తెలుగులో విడుదలైంది. మళ్లీ ఇప్పుడు అదే టైటిల్ తో బెల్లంకొండ శ్రీనివాస్ రాబోతున్నాడు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన “సీత” చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.