telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హాస్పిటల్ లో ఎస్పీ బాలసుబ్ర‌హ్మ‌ణ్యం 51వ వివాహ వార్షికోత్స‌వం…?

SPB

లెజెండరీ సింగర్, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 11న ఆసుపత్రిలో చేరిన ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. అయితే తాజాగా ఎస్పీ బాలసుబ్ర‌హ్మ‌ణ్యం త‌న 51వ వివాహ వార్షికోత్స‌వాన్ని ఆసుప‌త్రిలో జ‌రుపుకున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు ఎస్పీ బాలు స‌తీమ‌ణి సావిత్రి ఆసుప‌త్రికి వెళ్లార‌ని, ఐసీయూలోనే దంప‌తులు కేక్ క‌ట్ చేసిన‌ట్లు అక్క‌డి త‌మిళ మీడియా కొన్ని ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేసింది. వైద్యుల స‌మక్షంలో, అన్ని జాగ్ర‌త్త‌ల న‌డుమ బాలు దంప‌తులు శ‌నివారం సాయంత్రం పెళ్లి రోజును జ‌రుపుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ పోస్టులు వైర‌ల్‌గా మారాయి. అయితే ఈ విషయంపై ఆసుప‌త్రి వ‌ర్గాలు కానీ, బాలు కుమారుడు ఎస్పీ చ‌ర‌ణ్ కానీ అధికారికంగా ప్రకటన చేయలేదు.

Related posts