telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

చనిపోయిన తల్లితో 5 రోజుల పాటు కొడుకు…

తల్లి చనిపోయిన 5 రోజుల పాటు కొడుకు శవాన్ని ఇంటిలోనే పెట్టుకుని ఉన్నాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. అయితే శవం నుండి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు పిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తన తల్లి నిద్ర పోతుందని , ఆమె ను లేపకండి అంటూ అక్కడికి వచ్చిన వైద్య సిబ్బందితో కొడుకు అనడం చూసి వారంతా ఆశ్చర్య పోయారు. అతనికి మతిస్థిమితం లేదని గుర్తించారు. తను ఇలా చేయడం ఇది మొదటి సారి కాదు. గతంలో అతని చెల్లెలు చనిపోయినప్పుడు కూడా తల్లీ, కొడుకు ఇలాగే చేశారు. శవాన్ని కొన్ని రోజుల పాటు ఇంటిలోనే పెట్టుకున్నారు. ఇప్పుడు తల్లి  చనిపోతే కొడుకు మళ్లీ అదే విధంగా చేశాడు.  వివరాల్లోకి వెళ్తే 2018 జూన్ 10 న ఇంట్లోనే కూతురు జ్యోతి చనిపోయింది. తల్లి కొడుకు ఆ విషయం ఎవరీ చెప్పకుండా శవాన్ని వారం రోజులు ఇంట్లోనే పెట్టుకున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి అంత్య క్రియలు చేశారు. తాజాగా అదే ఘటన మరోసారి పునరావృత్తం అయ్యింది. తల్లి మంజులాదేవి చనిపోవడంతో కొడుకు రవిచంద్ర తల్లి శవాన్ని 5 రోజుల పాటు ఇంటిలోనే పెట్టుకున్నాడు. చివరికి స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వైద్య సిబ్బందితో కలిసి పోలీసులు అక్కడికి వచ్చారు.

Related posts