telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

ఫిలిమ్ నగర్ దైవసన్నిధానంలో “సీతారామ కళ్యాణం”

శ్రీరామనవమి సందర్భంగా ఫిలింనగర్ దైవ సన్నిధానంలో బుధవారం కుమారి నిహంత్రి రెడ్డి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది.

ఈ బృందం వారు ప్రదర్శించిన సీతారామ కళ్యాణ ఘట్టం ప్రేక్షకులను ఆకట్టుకున్నది.

అనంతరం ముఖ్యఅతిథిగా విచ్చేసిన *ఆంధ్రప్రదేశ్ మాజీ డి.జి.పి. శ్రీమాలకొండయ్య నృత్య కళాకారిణులందరికి దైవ సన్నిధానం వారి జ్ఞాపిక, శాలువా, ప్రసాదములు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాలకమండలి కోశాధికారి కాజ సూర్యనారాయణ ,ఫినిక్స్ అధినేత చుక్కపల్లి సురేష్ , ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు మరియు అర్చకులు పాల్గొన్నారు.

Related posts