telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నితిన్ సినిమాలో శ్రీయ బోల్డ్ రోల్

Shriya-sharan

ఆయుష్మాన్ ఖురానా హీరోగా రాధికా ఆప్టే, టబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన అంధాదున్ మూవీ మంచి విజయం సాధించింది. ఆ మూవీలో నటనకు గాను హీరో ఆయుష్మాన్ ఖురానా జాతీయ ఉత్తమనటుడు అవార్డు గెలుచుకున్నాడు. ఈ హిందీ చిత్రాన్ని తెలుగులో హీరో నితిన్ రీమేక్ చేయనున్నాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ మూవీ రీమేక్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈ మూవీలో బోల్డ్ నెస్ తో కూడిన నెగెటివ్ రోల్ ఒకటి ఉంది. హిందీలో ఆ పాత్రను హీరోయిన్ టబు చేశారు. ఇక తెలుగులో ఈ పాత్ర ఎవరితో చేయించాలి అనే విషయంలో అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. రమ్య కృష్ణ, అనసూయ అంటూ అనేక పేర్లు వినిపించాయి. అయితే మొదట టబునే తెలుగులో ఆ పాత్రలో నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నయనతార నటిస్తుంది అన్నారు. కానీ ఆమె భారీ రెమ్యునరేషన్ అడగటంతో ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ దగ్గరకు వెళ్లారట.  తాజాగా ఈ చిత్రబృందం శ్రియా ను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. శ్రియా కూడా దానికి ఒప్పుకున్నట్లు అలాగే రెమ్యునరేషన్ కూడా తమ బడ్జెట్ లో ఉండటంతో నిర్మాతలు సంతోషంగా ఉన్నట్లు సమాచారం. కొన్నిరోజుల్లో ఈ విషయం పై అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.

Related posts