telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రగ్స్ మత్తులో క్రికెటర్ల భార్యలు… హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Sherlyn

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం బయటపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. అయితే తాజాగా డ్రగ్స్ సెగ క్రీడారంగానికి కూడా తాకింది. ఈ నేపథ్యంలో క్రికెటర్ల భార్యలపై షాకింగ్ కామెంట్స్ చేసింది బోల్డ్ బ్యూటీ షెర్లిన్ చోప్రా. ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి తాను కోల్‌కతా వెళ్ళినప్పుడు కొన్ని సంఘటనలు కళ్లారా చూశానని చెబుతూ ఆటం బాంబు పేల్చింది షెర్లిన్ చోప్రా. మ్యాచ్ తర్వాత జరిగిన ఓ పార్టీకి తనను ఆహ్వానిస్తే వెళ్లానని, ఆ పార్టీకి స్టార్ క్రికెటర్లు, వారి భార్యలు కూడా వచ్చారని చెప్పిన షెర్లిన్.. అక్కడ వాళ్ళు తమ భార్యలతో కలిసి చేస్తున్న నిర్వాకం చూసి షాకయ్యానని చెప్పింది. పార్టీలో ఫుల్లుగా ఎంజాయ్ చేసి వాష్ రూమ్ వెళదామని అక్కడికి వెళ్లగా.. అక్కడ క్రికెటర్ల భార్యలు కొకైన్ తీసుకుంటూ కనిపించారని తెలిపింది. ఆ స్టార్ క్రికెటర్ల భార్యలు తనను చూసి ఓ నవ్వు నవ్వి తమ పని తాము చేసుకున్నారని షెర్లిన్ తెలిపింది. ఇక పురుషుల వాష్‌ రూములోనూ ఇదే సీన్ ఉండొచ్చని అక్కడి వాతావరణం చూస్తే అనిపించిందని, దీంతో తాను ఆ పార్టీలో ఉండటం అంత మంచిదికాదని గ్రహించి వెంటనే పార్టీ నుంచి బయటకు వచ్చేశానని తెలిపింది. ఆ క్రికెటర్లు ఎవరనేది మాత్రం వెల్లడించలేదు ఈ బ్యూటీ. అయితే ఎన్‌సీబీ అధికారులు అడిగితే పూర్తి వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పడం మరో సంచలనంగా మారింది.

Related posts