telugu navyamedia
రాజకీయ వార్తలు

నేను కూడా నిరాహారదీక్షను పాటిస్తున్నా: శరద్ పవార్

sharad power ncp

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు లోక్ సభ, రాజ్యసభల ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో విపక్షాలకు చెందిన 8 మంది రాజ్యసభ సభ్యులను ఈ సమావేశాల మొత్తానికి సభ నుంచి సస్పెండ్ చేశారు.   

సస్పెన్షన్ ఎత్తేసేంత వరకు సభలో అడుగుపెట్టబోమని విపక్షాలు ప్రకటించాయి. మరోవైపు సస్పెన్షన్ కు గురైన వారు పార్లమెంటు ప్రాంగణంలో ఉంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు.

నిరసన వ్యక్తం చేస్తున్న సభ్యులకు సంఘీభావంగా తాను కూడా నిరాహారదీక్షను పాటిస్తున్నానని తెలిపారు. పార్లమెంటులో బిల్లులను ఇంత దారుణంగా పాస్ చేయడాన్ని తాను ఎప్పుడూ చూడలేదని ఆయన మండిపడ్డారు.

Related posts