telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనారోగ్యంతో సీనియర్ నటి ఉషారాణి కన్నుమూత

Usha

సీనియర్ నటి ఉషారాణి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె వయసు 65 సంవత్సరాలు గతకొద్దిరోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆమె ఆదివారం నాడు చెన్నైలోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆమె కొన్నిరోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని ఆమె సన్నిహితులు తెలిపారు. ఉషారాణి మృతికి పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, జయసూర్య వంటి మాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 200వరకు చిత్రాల్లో నటించిన ఆమె దక్షిణాదిలో మంచి నటిగా గుర్తింపు పొందారు. ఎన్నై పోల్ ఒరువన్, మన్నవ, పాత్రమ్, హిట్లర్, స్వర్ణ కిరీడం, మలయేథుమ్ మున్పె, కన్మదం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఉషారాణి కొన్ని టీవీ సిరియళ్లలోనూ నటించి బుల్లితెరపై అభిమానులను సంపాదించుకున్నారు. 2004లో చివరిసారి మైలాటం అనే సినిమాలో కనిపించారు. మలయాళ దర్శకుడు, దివంగత శంకర్ నాయర్ ను‌ 1971 సంవత్సరంలో ఆమె వివాహం చేసుకున్నారు.

Related posts