telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలి… భోజ్ పురి సూపర్ స్టార్ డిమాండ్

Sushanth

బీజేపీ ఎంపీ, భోజ్ పురి సూపర్ స్టార్ మనోజ్ తివారి బాలీవుడ్లో సంచలనం సృష్టించిన యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆయన పాట్నాలోని సుశాంత్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… సుశాంత్ ఆత్మహత్యపై అనుమానాలున్నాయని, ఆ కేసును సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేసాడు. 16 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోయిన సుశాంత్ ఎన్నడూ తడబడలేదని, అలాంటివాడు ఎలా ఆత్మహత్య చేసుకుంటాడని ప్రశ్నించాడు. సుశాంత్ చాలా చిన్నస్థాయి నుండి బాలీవుడ్ లో హీరో వరకు ఎదిగాడని అన్నారు. సినీపరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా చాలా కష్టమని, సుశాంత్ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారించాలని కోరారు. బాలీవుడ్ లో నేపాటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.

Related posts