టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నటిస్తోన్న తాజా చిత్రం ‘పుష్ప: ది రైజ్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ , బన్నీ కాంబినేషన్లో పదేళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు మొదలైయ్యాయి.
ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ , మేకింగ్ వీడియో సినిమా పైన వీపరితమైన హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ బన్నీ అభిమానులను వీపరితంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ మా స్ లుక్, డైలాగ్ లకి ఫిదా అయిపోతున్నారు. ఈ ట్రైలర్పై పలువురు సెలబ్రిటీలు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు.
ఈ క్రమంలో సినిమా ట్రైలర్ పైన టాప్ హీరోయిన్ సమంత స్పందించింది. “పుష్పా రాజ్.. తగ్గదే.. లే” అని రాసి పైర్ ఎమోజీని ట్వీట్ చేసింది. కాగా ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేస్తోన్న సమంత.
కాగా..పుష్ప చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా మొదటిభాగం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 17న నాలుగు భాషలలో రిలీజ్ చేయనున్నారు.