ఇటీవలే కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తేజ దర్శకత్వంలో “సీత” చిత్రం విడుదలైంది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. చందమామ కాజల్ అగర్వాల్ను దర్శకుడు తేజ “లక్ష్మీ కళ్యాణం” సినిమాతో టాలీవుడ్కు పరిచయం చేశాడు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో రెండు సినిమాలు వచ్చాయి. “లక్ష్మీకళ్యాణం”తోపాటు “నేనే రాజు నేనే మంత్రి”, “సీత” సినిమాలు కాజల్, తేజ కాంబినేషన్లో వచ్చాయి. అయితే వీటిలో “నేనే రాజు నేనే మంత్రి” సినిమా మాత్రమే విజయం సాధించింది. త్వరలో వీరి కాంబినేషన్లో నాలుగో సినిమా రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు కాజల్ నిర్మాతగా కూడా వ్యవహరించబోతోందట. కథానాయిక ప్రాధాన్యమున్న స్క్రిప్టును కాజల్ కోసం తేజ సిద్ధం చేశాడట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
next post