బాలీవుడ్ వివాదాస్పద నటి పాయల్ ఘోష్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే సారథ్యంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే)లో చేరింది. పార్టీ చీఫ్ రామ్దాస్ అథవాలే స్వయంగా ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాదు ఆమెకు పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలి పదవిని కూడ ఇచ్చేశారు. పాయల్ ఇలా ఒక్క రోజు వ్యవధిలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం, పదవి పొందడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తమ మీద లైంగిక దాడి చేశాడని, అతని అరెస్ట్ చేయాలని పాయల్ ఘోష్ పెద్ద దుమారమే రేపింది. పోలీస్ ఫిర్యాదులతో పాటు పలువురు రాజకీయ నాయకులను కూడ కలిసి తనకు మద్దతివ్వాలని కోరింది. కాగా పాయల్ ఘోష్ తెలుగులో ‘ప్రయాణం, ఊసరవెల్లి’ చిత్రాల్లో నటించింది.
previous post
next post