telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

సమాజ్ వాదీ పార్టీ నుండి .. తొలిజాబితా(6)… !

samajvadi party first list of candidates

సమాజ్ వాదీ పార్టీ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బరిలోకి దిగే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం ఆరుగురు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. వారిలో ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, అక్షయ్ యాదవ్, కమలేష్ కఠేరియా, భాయీలాల్ కోల్, షబ్బీర్ వాల్మీకిలు ఉన్నారు. ములాయం సింగ్ మైనాపురి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ధర్మేంద్ర యాదవ్, అక్షయ్ యాదవ్ లు ములాయం బంధువులే.

గత లోక్ సభ ఎన్నికల్లో మైనాపురి, ఆజంగఢ్ స్థానాల నుంచి ములాయం పోటీ చేసి, రెండు చోట్లా గెలుపొందారు. అనంతరం మైనాపురి స్థానానికి రాజీనామా చేసి, ఆజంగఢ్ ఎంపీగా కొనసాగారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికలో మైనాపురి నుంచి వీరి కుటుంబానికే చెందిన తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ పోటీ చేసి, గెలుపొందారు.

Related posts