telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

యామిని కేసుపై స్పందించిన సోము వీర్రాజు

Somu-Veerraju bjp

అయోధ్య రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని భారత్ తో పాటు అనేక దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అయితే, టీటీడీకి  చెందిన ఎస్వీబీసీ ఛానల్ మాత్రం ప్రసారం చేయలేదు. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ నాయకురాలు సాదినేని యామిని ప్రస్తావిస్తూ టీటీడీపై విమర్శలు గుప్పించారు. దీంతో ఆమెపై టీటీడీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.

అయోధ్యలోని రామాలయం శంకుస్థాపన శతాబ్దాల కల అని వీర్రాజు అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచంలోని 250 ఛానల్స్ ప్రత్యక్షప్రస్తారం చేశాయని తెలిపారు. కానీ, కలియుగ దైవం అయిన శ్రీవెంకటేశ్వరస్వామి యొక్క టీటీడీ ఛానల్ ప్రసారం చేయలేదని ఆవేదన్య వ్యక్తం చేశారు. పలువురు బీజేపీ నేతలు ఇప్పటికే ఈ అంశాన్ని ప్రస్తావించారని చెప్పారు. యామిని కేసును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.

Related posts