telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భార్యకు కరోనా

SPB

గానగంధర్వుడు, దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనకు కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని ఇటీవల బాలు వెల్లడించారు. తాను బాగానే ఉన్నానని, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పారు. కానీ, కరోనా వైరస్ కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని, పరిస్థితి విషమంగా ఉందని శుక్రవారం మధ్యాహ్నం వార్తలు రావడంతో అంతా షాక్ అయ్యారు. బాలసుబ్రహ్మణ్యంకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు ప్రకటించడంతో సంగీత ప్రియులు, బాలు శ్రేయోభిలాషులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు ఆయన భార్య కూడా కోవిడ్ బారిన పడ్డారు. బాలుకు పాజిటివ్ రావడతో కుటుంబ సభ్యులకు టెస్టులు నిర్వహించారు. దీంతో బాలు సతీమణి సావిత్రికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. బాలు భార్య కూడా ఇప్పుడు వైరస్ బారిన పడటం అభిమానులకు మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

Related posts