గతంలో రామానంద్ సాగర్ తీసిన రామాయణం సీరియల్ను డీడీలో మరోసారి ప్రసారం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ బుల్లి తెర ధారావాహిక రికార్డుల్లో నిలుస్తూనే ఉంది.బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ తెలిపిన వివరాల ప్రకారం టెలివిజన్లో ఎక్కువ మంది చూస్తోన్న కార్యక్రమాల్లో రామాయణం మొదటి స్థానంలో నిలిచింది.
టీఆర్పీల పరంగా రామాయణం నేటికీ టాప్ రేటింగ్లోనే ఉండడం గమనార్హం. అలాగే, డీడీలో ప్రసారమవుతోన్న శ్రీ కృష్ణ నాలుగో స్థానం ఉంది. రామాయణం తర్వాత రెండో స్థానంలో జీ టీవీలో వస్తున్న కుండలి భాగ్య సీరియల్ ఉన్నాయి. అధెవిధంగా మూడో స్థానంలో మహిమా శానిదేవ్ కీ ఉన్నాయి.