telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

చేసిన పనికి డబ్బులు అడిగినందుకు… పెంపుడు సింహం దాడి…!?

Lion

అలీ రజా అనే వ్యక్తి లాహోర్‌లో ఓ కాన్ఫరెన్స్ హాల్ నిర్వహిస్తుంటాడు. మతపరమైన సమావేశాలకు ఆ హాల్‌ను స్థానికులు ఎక్కువగా వినియోగిస్తుంటారు. కాగా.. కాన్ఫరెన్స్ హాల్‌లో విద్యుత్ పనులను చక్కబెట్టేందుకు మహ్మద్ రఫీక్ అనే ఎలక్ట్రీషియన్‌ను అలీ రజా పనిలో పెట్టుకున్నాడు. పనిపూర్తయిన తర్వాత రఫీక్‌కు డబ్బులు చెల్లించలేదు. రేపుమాపు అంటూ కాలయాపన చేయసాగాడు. ఈ నేపథ్యంలో డబ్బు విషయమై మరోసారి ప్రశ్నించేందుకు రజా ఇంటికెళ్లిన రఫీక్.. డబ్బు చెల్లించకపోతే అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశాడు. దీంతో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో ఉద్రేకానికి లోనైన రజా.. రఫీక్‌పై తన పెంపుడు సింహాన్ని ఉసిగొలిపాడు. సింహం దాడితో రఫీక్‌ మొహం మీద చేతుల మీద గాయాలయ్యాయి. అతడి అరుపులు విన్న ఇరుగుపొరుగు.. రంగంలోకి దిగి రఫీక్‌ను రక్షించారు. ఇద్దరి మధ్యా సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. ఆసుపత్రి ఖర్చులు తానే భరిస్తానని రజా మాటివ్వడంతో రఫీక్ వెనుదిరిగాడు. అయితే రజా మాత్రం తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. దీంతో రఫీక్ రెండు రోజుల క్రితం స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. జీతం అడిగినందుకు తనపై సింహంతో దాడిచేయించాడని.. రజాక్‌పై ఫిర్యాదు చేశాడు. హత్యాయత్నానికి పాల్పడినందుకుగాను రజాపై పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Related posts