బాలీవుడ్ నటి సుచిత్ర కృష్ణమూర్తి చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఈ ట్వీట్ లో ఆమె వేశ్యలను, నేరస్తులతో పోల్చారు. సుచిత్ర 90వ దశాబ్దంలో పలు చిత్రాల్లో నటించింది. సుచిత్ర ప్రముఖ ఫిల్మ్ మేకర్ శేఖర్ కపూర్ భార్య. ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. “అమ్మ సరిగ్గానే చెప్పింది. అవి నేరస్తుల దగ్గరా, వేశ్యల దగ్గరా ఉంటాయి. అయితే క్యారెక్టర్, ఆత్మగౌరం అనేవి ముఖ్యం. ఆమె మాటల్లోని నిజాన్ని ఇప్పుడు గ్రహించగలిగాను” అంటూ ట్వీట్ చేశారు సుచిత్ర.
సుచిత్ర ట్వీట్ పై అలనాటి తెలుగు సినిమా “మనీ”హీరోయిన్ రేణుక సహానే ఫైర్ అయ్యారు. వేశ్యలను, నేరస్తులతో పోల్చడం సరికాదన్నారు. ఎందుకంటే వేశ్యలు తమను తాము అమ్ముకుంటారు. వేశ్యలు నిస్సహాయతకు గురై అలా జీవిస్తుంటారు. సమాజం వారిని వెలివేసినట్టు చూస్తుంది. అదే నేరస్తులైతే దోచుకుంటారు. వారికి పార్లమెంటులో స్థానం లభించడంతో పాటు పారిశ్రామిక వేత్తలుగా ఉంటారు అంటూ వేశ్యలకు, నేరస్తులకు మధ్య ఉన్న తేడాను వివరించారు. ఈ ట్వీట్ చూసిన సుచిత్ర తన పొరపాటును ఒప్పుకోవడమే కాకుండా తాను ఎవరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.