telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

టిక్ టాక్ ను సొంతం చేసుకునేందుకు రిలయన్స్ యత్నం!

Mukesh ambani

ఇండియాలో చైనాకు చెందిన వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ను నిషేధించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు పలు కంపెనీలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ టిక్ టాక్ ను సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నారని, ఓ వార్త వచ్చింది. ఇరు కంపెనీల అధికారుల మధ్య ధర విషయమై చర్చలు సాగుతున్నాయని సమాచారం.

ఇండియాలో తమ మొత్తం వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కు విక్రయించేందుకు బైట్ డ్యాన్స్ సైతం సుముఖంగానే ఉందని ఈ విషయంలో టిక్ టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ మేయర్ స్వయంగా ఆర్ఐఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లతో చర్చించారని, దాదాపు నెల రోజుల క్రితమే చర్చలు ప్రారంభమైనా, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ‘టెక్ క్రంచ్’ తన ప్రత్యేక రిపోర్టులో పేర్కొంది.

ఇక టిక్ టాక్ భారత విభాగాన్ని సొంతం చేసుకోనుందన్న వార్తలపై అధికారికంగా స్పందించేందుకు రిలయన్స్ నిరాకరించింది. కాగా, సెప్టెంబర్ 15కు లోపే టిక్ టాక్ అమెరికా వ్యాపారాన్ని అమ్మేసుకోవాలని ఆ తరువాత, చైనా మాతృసంస్థతో ఏ విధమైన లావాదేవీలనూ అనుమతించేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పిన సంగతి విదితమే.

Related posts