బాలీవుడ్ నటుడు రిషి కపూర్ (67) ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్తతో యావత్ దేశం విషాదంలో మునిగిపోయింది. రిషి కపూర్ మృతిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
‘భారతీయ సినీ పరిశ్రమకు ఇదొక భయకరమైన వారం. మరొక లెజెండ్ రిషి కపూర్ కూడా వెళ్లిపోయారు. ఒక అద్భుతమైన నటుడు. దశాబ్దాలుగా ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారు. రిషి కపూర్ లేని లోటు పూడ్చలేనిది. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు సానుభూతిని తెలియజేస్తున్నా’ అని రాహుల్ ట్వీట్ చేశారు.