telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ ఛాలెంజ్ ను పూర్తి చేసిన శృతి హాసన్

Shruthi

సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టినరోజు నాడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ ఛాలెంజ్‌కు తమిళ స్టార్ హీరో విజయ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, హీరోయిన్ శృతిహాసన్‌ను నామినేట్ చేశారు. ఇప్పటికే విజయ్ ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు శృతిహాసన్ కూడా మహేష్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు. నిజానికి మహేష్ బాబు కన్నా ముందే ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. శృతిహాసన్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను విసిరారు. అందుకే తనను ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేసినందుకుగాను మహేష్ బాబుతో పాటు దేవిశ్రీ ప్రసాద్‌కు శృతిహాసన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటుతోన్న ఫొటోలను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఛాలెంజ్‌ను తాను బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్, కొత్త పెళ్లికొడుకు రానా దగ్గుబాటి, మిల్కీ బ్యూటీ తమన్నాకు విసురుతున్నట్టు శృతిహాసన్ పేర్కొన్నారు. శృతిహాసన్ ట్వీట్‌కు సూపర్ స్టార్ స్పందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించినందుకు శృతిహాసన్‌ను అభినందించారు.

Related posts