ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే ఆస్పత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఆయన బుధవారం మృతి చెందారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా ఆయన రాణించారు. పలు కార్యక్రమాలకి ఆయన యాంకర్గా కూడా పని చేశారు. రాజకీయాలలోను చురుకుగా పని చేవారు. దాదాపు 600కి పైగా సినిమాలలో నటించిన వేణు మాధవ్ హంగామా, భూ కైలాస్ చిత్రాలలో హీరోగా చేశారు. ఆయనకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనారోగ్య కారణాల వలన ఐదేళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్నారు వేణు మాధవ్. చివరిగా రుద్రమదేవి చిత్రంలో కనిపించారు. కెరీర్ మంచి హైప్ ఉన్న సమయంలో వేణు మాధవ్ హీరోలకి సమానంగా రెమ్యునరేషన్ అందుకున్నారు. దాదాపు ప్రతి సినిమాలోను ఏదో ఒక వేషం వేసే వేణు మాధవ్ గత ఐదు సంవత్సరాలుగా సినీ పరిశ్రమకి దూరంగా ఉన్నారు. తను సినిమాలకి దూరం కావడంపై ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు వెల్లడించారు వేణు మాధవ్. ప్రస్తుతం ఇండస్ట్రీలో బూతు సినిమాలు ఎక్కువ అయ్యాయి. ఫ్యామిలీతో అవి చూసేలా లేవు. నా పిల్లలు ఎదుగుతున్నారు. వారు ఏంటి ఇలాంటి సినిమాలు చేస్తున్నావని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. అందుకే సినిమాలు చేయలేదని చెప్పుకొచ్చారు.
previous post
next post


“బిగ్ బాస్”లో మహిళా వివక్ష… యాంకర్ ఝాన్సీ ఫైర్