telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చైనా యాప్స్, దేశభక్తిపై సంచలన వ్యాఖ్యలు… వర్మ ఓపెన్ ఛాలెంజ్

Ramgopal varma

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చైనా యాప్స్ గురించి సంచలన కామెంట్స్ చేస్తూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. చైనా ఉత్పత్తులైన టిక్ టాక్ లాంటి యాప్స్ లేకుండా ప్రజలు ఉండలేరని అన్నారు వర్మ. ఒకవేళ ఆవేశంలో టిక్ టాక్ లాంటి యాప్స్ అన్‌ఇన్స్టాల్ చేసినా కూడా పది రోజులు తిరగకుండానే తిరిగి ఇన్స్టాల్ చేసుకుంటారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కొన్ని రోజుల్లోనే అందరూ టిక్ టాక్ తిరిగి ఇన్స్టాల్ చేసుకోకుంటే నా పేరు మార్చుకుంటా అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. చైనా యాప్ అయిన జూమ్ ద్వారా వీడియో కాల్స్‌లో మాట్లాడుతూ చైనా ప్రొడక్ట్స్ బ్యాన్ చేయాలని డిమాండ్ చేసే పరిస్థితులు చూస్తున్నాం అంటూ తనదైన కోణంలో పవర్‌ఫుల్ పంచ్ వేశారు రామ్ గోపాల్ వర్మ. ఇక అదే ఇంటర్వ్యూలో దేశ భక్తి గురించి కూడా కామెంట్ చేసిన వర్మ.. దేశంలో 99 శాతం మందికి అసలు దేశభక్తి అంటే అర్థమే తెలియదని అన్నారు. ”దేశంలో 130 కోట్ల జనాభా ఉంటే.. అందులో నీకు బాగా తెలిసిన వాళ్ళు 100 మందే ఉంటారు. ఆ 100 మందిలో వాడు వేస్ట్.. వీడు పనికిరాడంటూ 90 మందిని తిడతావు. ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ మీద కూడా కంప్లైంట్ చేస్తావు. ఇక ‘ఐ లవ్ మై కంట్రీ’ అనడంలో అర్ధమేంటో నాకైతే తెలియయడం లేదు” అన్నారు రామ్ గోపాల్ వర్మ. చైనాను భారతదేశం దీటుగా ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా ఆ దేశ ఉత్పత్తులను గణనీయంగా తగ్గించటానికి కసరత్తులు ప్రారంభమయ్యాయి. చైనా ఉత్పత్తుల బహిష్కరణపై కేంద్ర మంత్రులు బహిరంగంగా మాట్లాడటంతో ఆ దేశ ఉత్పత్తులు, మొబైల్ యాప్స్ బహిష్కరించాలనే డిమాండ్స్ పెరిగాయి. ఇకపోతే ఇటీవలే క్లైమాక్స్ మూవీతో ఆన్‌లైన్ వేదికలను ఓ ఊపు ఊపేసిన ఆయన.. అదే ఓటీటీని టార్గెట్ చేస్తూ పలు సినిమాలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అందులో నుంచి ”నగ్నం, మర్డర్” సినిమాలను ఫుల్లుగా ప్రమోట్ చేసుకుంటున్నారు వర్మ.

Related posts