రామ్ చరణ్-శంకర్ కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శంకర్, చెర్రీ ఇద్దరూ ఇద్దరే.. శంకర్ తన దర్శకత్వంతో సినిమాకు ఎంత హైప్ తీసుకువస్తాడో, చెర్రీ కూడా అదే స్థాయిలో తన నటనతో సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకు వెళ్తారు. వీరి కాంబోలో సినిమా అనడంతో సినిమా చాలా కొత్తగా ఉంటుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ కాంబో మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ను ఎంపిక చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంట. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. కాబట్టి రకుల్ ప్రీత్ సింగ్కు తెలుగు, హిందీలో మంచి మార్కెట్ ఉంది. నిజానికి శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఇండియన్2 కోసం రకుల్ ఇచ్చిన కాల్షీట్స్ను ఈ సినిమాకు వినియోగించుకోవాలని శంకర్ చూస్తున్నారంట. ఈ మేరకు వార్తలు కోలీవుడ్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్కు ఫోటో షూట్లు కూడా నిర్వహించారంట. మరి ఈ సినిమాలో హీరోయిన్గా రకుల్ ఫిక్స్ అవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
previous post