telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరంజీవి రాకతో అలిగి వెళ్ళిపోయిన రకుల్…!?

Rakul

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మేనేజర్ల రజతోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లోని గ‌చ్చిబౌలిలో ఆదివారం ఘనంగా జరిగింది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా చాలా మంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుక కృష్ణ‌, కృష్ణంరాజు, త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్‌, టి.సుబ్బ‌రామిరెడ్డి, ముర‌ళీమోహ‌న్‌, జ‌య‌ప్ర‌ద‌, జ‌య‌సుధ‌, సుమల‌త‌, రాజేంద‌ప్ర‌సాద్‌, న‌రేశ్‌, కోట‌శ్రీనివాస‌రావు స‌హా ప‌లువురు సినీ పెద్ద‌లు హాజ‌ర‌య్యారు. అయితే మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌లు క‌లిసి కూర్చుని మాట్లాడుకున్నారు. ఇదే స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది. ఫొటోల‌న్నీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ వేడుకలో చాలా మంది స్టార్లు లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓ నాట్య ప్రదర్శన ఇచ్చేందుకు కమిట్ అయ్యింది. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ప్రదర్శన తర్వాత రకుల్ ప్రీత్ పెర్ఫార్మెన్స్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి రావడంతో హడావుడి మొదలైంది. ఆ వెంటనే ప్రముఖుల స్పీచ్‌ల కార్యక్రమం మొదలైంది. ఆ వెంటనే చిరంజీవిని పైకి ఆహ్వానించి మాట్లాడించారు. ఈ క్రమంలో రకుల్ ప్రదర్శన సాధ్యం కాలేదు. దీంతో రకుల్ అలిగి ఆ కార్యక్రమం నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం.

Related posts