telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..

సినీ పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కోల్పోయిన సిని పరిశ్రమ.. మరో కీలక నటున్ని కోల్పోయింది. తాజాగా బాలీవుడ్‌ కపూర్స్‌ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దివంగత రిషి కపూర్‌ను కోల్పోయిన ఫ్యామిలీ వెంటనే మరో ఫ్యామిలీ మెంబర్‌ను పోగోట్టుకుంది. బాలీవుడ్ షో మేన్ రాజ్ కపూర్ తనయుడు, రాజీవ్ కపూర్ (58) గుండెపోటుతో కన్నుమూశారు. ‘రామ్ తేరీ గంగా మైలీ, తేరా సాథీ, హమ్ తో చలే పర్ దేశ్’ తదితర చిత్రాలలో రాజీవ్ కపూర్ నటించాడు. 1962 ఆగస్ట్ 25న జన్మించిన రాజీవ్ కపూర్ నటనకే పరిమితం కాలేదు. పలు చిత్రాలను నిర్మించడంతో పాటు కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. అలానే ‘ప్రేమ్ గంథ్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. 1983లో తొలిసారి ‘ఏక్ జాన్ హై హమ్’లో నటించిన రాజీవ్ కపూర్, 1985లో రాజ్ కపూర్ దర్శకత్వం ‘రామ్ తేరీ గంగా మైలీ’లో హీరోగా నటించాడు. ఆ తర్వాత నటించిన ‘ఆస్మాన్, లవర్ బోయ్, జబర్దస్త్’ వంటి చిత్రాలు నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. చివరిగా 1990లో ‘జమ్మేదార్’ చిత్రంలో ఆయన నటించారు.

Related posts