అక్కినేని వారసుడు అఖిల్ నటించిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. తాజాగా అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తన నాలుగో చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బేనర్పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం గ్రాండ్గా లాంచ్ కాగా, రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ నుండి జరగనున్నట్టు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అఖిల్కి తల్లిగా సీనియర్ హీరోయిన్ ఆమని ఎంపిక చేసుకున్నారట. ఈ చిత్రంలో తల్లి పాత్ర కీలకం కాగా, ఆ పాత్రకి ఆమని అయితే బాగుంటుందని దర్శకుడు భావించారట. 24 ఏళ్ళ క్రితం “సిసింద్రీ” చిత్రంలో అఖిల్కి తల్లిగా ఆమని నటించడం విశేషం. అఖిల్కి తల్లిగా ఆమని నటించిన “సిసింద్రీ” చిత్రం మంచి హిట్ కావడంతో ఇప్పుడు అఖిల్ నాలుగో చిత్రం కూడా హిట్ అవుతుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
previous post