telugu navyamedia
సినిమా వార్తలు

కూతుళ్ళను ఆహ్వానించిన రాజశేఖర్

Jivitha-Rajasekhar

టాలీవుడ్ సీనియర్ హీరో రాజ‌శేఖ‌ర్, జీవిత‌ల కూతుళ్ళు శివానీ, శివాత్మిక‌లు తమ తొలి సినిమాతో వెండితెర తెరంగ్రేటం చేయనున్న విషయం తెలిసిందే. శివానీ ” 2 స్టేట్స్” తెలుగు రీమేక్‌తో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో అడ‌వి శేష్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇక శివాత్మిక “దొర‌సాని” చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను పలకరించనుంది. ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ హీరోగా న‌టిస్తున్నాడు. అతి త్వ‌ర‌లో ఈ ఇద్దరు ముద్దుగుమ్మ‌లు వెండితెర‌పై మెరవనున్నారు. మ‌రో వైపు రాజ‌శేఖ‌ర్ “క‌ల్కి” చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌రించేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఈ చిత్రం 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ చిత్రం కాగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కుతుంది. అ! ఫేమ్ ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా రాజ‌శేఖ‌ర్ త‌న ఇద్దరు కూతుళ్ళని ట్విట్ట‌ర్ లోకి ఆహ్వానిస్తూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ పెట్టారు. రానున్న రోజుల‌లో ఈ ఇద్ద‌రు అక్కచెల్లెళ్ళు త‌మ సినిమాలకి సంబంధించిన ప్ర‌మోష‌న్స్‌ని సోష‌ల్ మీడియా వేదికగా ప్ర‌చారం చేయనున్నారన్నమాట.

Related posts