telugu navyamedia
సినిమా వార్తలు

పదిహేనేళ్ళ తరువాత భార్యాభర్తలుగా ఆ జంట…!

Madhavan-and-Simran

ప్రముఖ తమిళ నటుడు మాధ‌వ‌న్ ప్ర‌స్తుతం ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయ‌ణ‌న్ బ‌యోపిక్‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని స్వ‌యంగా తెర‌కెక్కిస్తూ న‌టిస్తున్నాడు మాధ‌వ‌న్. “రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్‌” అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నంబి నారాయ‌ణ్ జీవితంలోని మూడు ప్ర‌ధాన కోణాల‌ని చూపించనున్న‌ట్టు స‌మాచారం. అయితే ఈ చిత్రం తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల కానుండ‌గా,షారూఖ్, సూర్య ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇక మాధ‌వ‌న్ భార్య‌గా సిమ్రాన్ క‌నిపించ‌నున్నార‌ట‌. పదిహేనేళ్ల తర్వాత తిరు, ఇందిర శ్రీమతి, శ్రీ నంబి నారాయణన్‌గా’ అంటూ రాకెట్రీ మూవీలో సిమ్రన్‌ క్యారెక్టర్‌ను సోషల్ మీడియా వేదికగా తెలిపాడు మాధ‌వ‌న్. దేశద్రోహం నేరం కింద ఇస్రో సైంటిస్ట్ అయిన నారాయణను 1994లో అరెస్ట్ చేయడం జరిగింది. తరువాత ఆయన నిర్దోషిగా బయటకు వచ్చి తనను అన్యాయంగా నేరంలో ఇరికించిన వారిపై న్యాయ పోరాటం చేస్తున్నారు. మాధ‌వ‌న్, సిమ్రాన్ 15 ఏళ్ళ క్రితం బాల‌చంద‌ర్ తెర‌కెక్కించిన ప‌ర‌వశం చిత్రంలో క‌లిసి న‌టించారు. ఆ త‌ర్వాత మ‌ణిర‌త్నం మూవీ కన్నాతిల్‌ ముథమిట్టల్‌లోను జంట‌గా నటించారు. ఆ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఒక్క సినిమా కూడా రాలేదు. 15 ఏళ్ళ త‌ర్వాత ఈ జంట ప్రేక్ష‌కుల‌ని అలరించబోతోంది.

Related posts