పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తుండగా నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో విడుదలైన నాలుగు పాటలకు మంచి స్పందన వచ్చింది. అలాగే టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ లు, టీజర్ లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమాకి ‘A’ సర్టిఫికేట్ రావడంతో యూత్ లో క్రేజ్ పెరిగిపోయింది. కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శించడంతో సినిమా టాక్ బయటకి వచ్చింది. సినిమాలో రామ్ అధ్బుతంగా డాన్స్ చేశాడని, తన కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ కనబరిచాడని, పూరి రాసిన డైలాగ్స్ మాస్, యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయని, తన మార్క్ డైలాగ్స్ తో పూరి అలరించాడని టాక్. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాను చూడడానికి ఇబ్బంది పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ ఎంతో ఎంటర్టైనింగ్ గా ఉందని, ఆసక్తికర మలుపుతో ఇంటర్వెల్ సన్నివేశాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం సినిమా బాగా స్లో అయిందని.. రివెంజ్ ప్లాట్ ఊహించే విధంగా ఉండడంతో క్లైమాక్స్ కనెక్ట్ అవ్వదని అంటున్నారు. సినిమాలో మూడు పాటలు బాగున్నాయట. ఇద్దరు హీరోయిన్లు తమ పాత్రలో ఓడిగిపోయారని, తెరపై అందంగా కనిపించారని తెలుస్తోంది. కమర్షియల్ గా చూసుకుంటే సినిమా వర్కవుట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని అంటున్నారు. సినిమా అసలు టాక్ ఏంటో తెలియాలంటే రివ్యూలు వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే.
previous post
మంచు విష్ణుపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు