telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బన్నీని కలిసేందుకు 200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వీరాభిమాని

AA

అల్లు అర్జున్ కు వీరాభిమాని అయిన పి.నాగేశ్వర రావు మాచర్ల నుంచి తన అభిమాన హీరో అల్లు అర్జున్ కు కలిసేందుకు 200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. అందుకోసం గత రెండు వారాల క్రితమే ప్రయాణమైన అతడు భారీ వర్షంలో కూడా ఆగకుండా నడిచాడు. అతడు అల్లు అర్జున్ ను కలిసేందుకు మాచెర్ల నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర చేశాడు.
మొత్తానికి ఇప్పుడు బన్నీ ఆ అభిమానిని కలిసి అతడి కల నెరవేర్చాడు. బన్నీ వీరాభిమాని అయినటువంటి నాగేశ్వర రావును తన ఆఫీస్ లో కలిసిన బన్నీ… అతడి యోగ క్షేమాలు కనుక్కున్నాడు. మొత్తానికి తన అభిమాన నటుడిని కలుసుకున్నందుకు నాగేశ్వరరావు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం బన్నీ.. సుకుమార్‌తో ‘పుష్ప’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మికా మందన హీరోయిన్‌గా నటించనుంది.

Related posts