telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తప్పు నాది కానప్పుడు నన్ను గెలికితే నేను ఎందుకు ఊరుకుంటా…?: రాహుల్ సిప్లిగంజ్

Rahul

గచ్చిబౌలిలోని ప్రిసం పబ్‌లో జరిగిన దాడిపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీర్ బాటిల్స్‌తో విచక్షణా రహితంగా రాహుల్‌పై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయిన రాహుల్ తనపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.అంతేకాకుండా తనతో ఉన్న మహిళల పట్ల కూడా దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించారని, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని తెలిపారు నాఫై దాడి చేసినవారిని అస్సలు వదిలిపెట్టను అంటున్నారు.వికారాబాద్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రిషిత్ శెట్టి ఈ ఘటనకు పాల్పడ్డాడని, అతనిపై గతంలోనూ ఇలాంటి కేసులు ఉన్నాయని రాహుల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పబ్‌లో ఏం జరిగిందో వివరిస్తూ అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను రివీల్ చేసిన రాహుల్ తనకు న్యాయం కావాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ చేసిన కొద్దినిమిషాల్లోనే లైవ్‌లో మాట్లాడారు. బిగ్‌బాస్ నుంచి వచ్చాక ఫ్రెండ్స్‌కి పార్టీలు అవీ ఇవ్వాలని అనుకున్నా. కానీ మొన్న పబ్‌లో జరిగిన గొడవ తర్వాత నేనే అమ్మాయిల్ని వేసుకుని వెళ్లాను కాబట్టి నేనే వాళ్లని గెలికాను అనుకుంటున్నారు. నేను ఎవ్వరి జోలికీ వెళ్లను. కానీ మొన్న మాత్రం పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉంది కదా అని నేను ఒక్కడినే ఉన్నానని నన్ను టార్గెట్ చేసారు. నేను ఏమీ అడగటంలేదు. నాకు న్యాయం కావాలి. తప్పు నాది కానప్పుడు నన్ను గెలికితే నేను ఎందుకు ఊరుకుంటా. వాళ్లు ఎనిమిది మంది ఉన్నారు. వాళ్లకు సిగ్గు అనిపించాలి. బ్యాగ్రౌండ్ ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. ఎక్కడపడితే అక్కడ చూపిస్తే బాగోదు. వాడు ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే నాకు న్యాయం కావాల్సిందే. ఈ ఘటన ఎక్కడికి పోతుందో చూద్దాం’ అని తెలిపారు.

Related posts